తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ 'ఇందిర మహిళా శక్తి' పథకం ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలను ప్రోత్సహిస్తోంది. నారాయణపేట జిల్లాలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ప్రారంభించిన పెట్రోల్ బంక్ ఆరు నెలల్లోనే రూ.13.82 లక్షల లాభం ఆర్జించింది. ఈ విజయంతో స్పూర్తి పొందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.