హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో భద్రతపై రైల్వే పోలీసులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని నాలుగు ట్రైన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే అన్ని ఎంఎంటీఎస్ ట్రైన్ మహిళల బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్టేషన్లలోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు.