తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రభుత్వం విస్తృతంగా అందిస్తుంది. సిటీ, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులతో పాటుగా ఎలక్ట్రిక్ మెట్రో బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎలక్ట్రిక్ బస్సులలో ప్రయాణం చేయాలంటే డబ్బులు చెల్లించాలేమో.. అందులో మహాలక్ష్మీ పథకం అమలు కాదేమో అని మహిళలు అపోహ పడుతున్నారు. దీని కోసం ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. అదేంటంటే..