తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే మహిళలు ఉచిత ప్రయాణానికి ఆధార్తో పాటు ఇతర గుర్తింపు కార్డులను కూడా ఉపయోగించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సేవలను మెరుగుపరచడం, సంస్థను లాభాల బాట పట్టించడం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.