మహిళ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ.. మహిళా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు కూడా విలువైన సూచనలు చేశారు డీకే అరుణ. పాలిటిక్స్లోకి రావాలనుకునే వారు అన్నింటికీ ముందే సిద్ధపడి రావాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.