తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇది శుభవార్త. ఇకపై వారు తమ ఆర్థిక లావాదేవీలను ముఖ్యంగా రుణాల తిరిగి చెల్లింపులను, సమీపంలోని తపాలా కార్యాలయాల ద్వారా నిర్వహించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు తక్కువగా ఉండటం, ప్రయాణ భారం, ఆలస్యమయ్యే చెల్లింపులతో ఎదురయ్యే ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్ను జులై నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.