తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు వివిధ రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. ఇప్పటికే బ్యాంకుల ద్వారా డ్వాక్రా సంఘాలకు రూ.5 లక్షల వరకు రుణాలను కల్పిస్తున్న ప్రభుత్వం.. ఆ సంఘం సభ్యులకే బస్సులను కేటాయించింది. వీటి ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 45 మహిళా సంఘాలకు.. 33 బస్సులు వివిధ మండలాలలోని మహిళా సంఘాలకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 600 బస్సులను కేటాయించారు.