పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్రానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత సైన్యం తగిన బుద్ధి చెబుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలంతా సైన్యానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయమని.. అందరం ఒక్కతాటిపైకి వస్తారన్నారు. ఆ వివరాలు..