‘మాకు ఇందిరమ్మ ఇళ్లు వద్దు’.. స్వతహాగా వదిలేసుకుంటున్న లబ్ధిదారులు.. కారణం ఇదే..

9 months ago 17
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ళు మంజూరైనప్పటికీ, పలు కారణాల వల్ల చాలా మంది లబ్ధిదారులు నిర్మాణ పనులను మొదలు పెట్టడం లేదు. మొదటి దశలో జారీ అయిన ఇళ్లలో.. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలలో అత్యధిక శాతం పనులు ఇంకా మొదలుకాలేదు. నిర్మాణానికి పెట్టుబడి లేకపోవడం.. స్థల సమస్యలు, లేదా కుటుంబంలో చోటు చేసుకున్న దుర్ఘటనలు వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలు. ఇళ్ళ నిర్మాణం కొరకు నాలుగు విడతలుగా నిధులు విడుదల అవుతాయి.. కానీ ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసుకుంటున్నారు.
Read Entire Article