భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ముస్లింలకు ప్రత్యేక దేశం అవసరం లేదని, తాము ఎల్లప్పుడూ భారతదేశంలోనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పాక్ రెండు దేశాల సిద్ధాంతాన్ని భారత్ ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ చర్యలను ఖండిస్తున్నామని ఒవైసీ పేర్కొన్నారు.