భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులపై అవగాహన కోసం నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్లో 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో సాయంత్రం 4:15 గంటలకు సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, మౌలాలిలో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇందులో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొంటారు. మాక్ డ్రిల్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్, ఏం చేయాలి? ఏం చేయొద్దనే విషయాలు ఓసారి తెలుసుకుందాం.