తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ కూడా సంతాపం తెలుపుతూ.. గోపీనాథ్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.