Chandrababu Condolences Gopinath Death: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. గోపినాథ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. గోపీనాథ్ తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.