TDP MLA Palla Srinivas Father Passed Away: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే సింహాచలం శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు సంతాపం తెలిపారు. సింహాచలం విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.