వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017లో జరిగిన ఈ హత్య కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా విధించింది. కేసులో 29 మంది సాక్షులను విచారించగా, ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రస్తుత ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పేరును గతంలోనే తొలగించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరోకరు చనిపోయారు. ఈ సంచలన కేసు వివరాలు..