మాజీ డీఎస్పీ నళిని మరోసారి సంచలనం పోస్ట్తో వార్తల్లో నిలిచారు. తన సర్వీసు సమస్యలు నవమి నాటికి పరిష్కారం కాకపోతే సజీవ సమాధి అవుతానని ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు. పైగా తన చావుకు సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని తెలిపారు. తన అనారోగ్యానికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. 21 నెలలుగా తాను ఇచ్చిన రిపోర్ట్పై చర్యలు లేకపోవడం తనను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి తన సమస్య పరిష్కరించాలి అన్నారు.