మాజీ మంత్రి కేటీఆర్ జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్లో ముఖ్యవక్తగా పాల్గొననున్నారు. 'భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు' అనే అంశంపై జరిగే ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. కేటీఆర్ అనుభవాలు, ఆలోచనలు అంతర్జాతీయ విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేథీ తెలిపారు.