మాజీ మంత్రి విడదల రజినికి రిలీఫ్.. హైకోర్టు కీలక ఆదేశాలు..

1 year ago 26
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి హైకోర్టులో ఊరట దక్కింది. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులో కఠిన చర్యలు వద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విడదల రజిని, ఆమె పీఏలపై కఠిన చర్యలు వద్దని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విడదల రజిని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. అనంతరం విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది.
Read Entire Article