మాజీ మంత్రి హరీష్‌ రావుకు అస్వస్థత.. కిమ్స్‌కు తరలింపు..

1 year ago 36
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు అధిక జ్వరం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్‌కు వచ్చినప్పుడు, హరీష్ రావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం సమావేశం మధ్యలోనే అసౌకర్యంగా భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేటీఆర్ కూడా హరీష్ రావును పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళనున్నారు. పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు దీనికి కారణమై ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.
Read Entire Article