ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్లు.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలన బాగుందని దేవ్జీ ప్రశంసించారు. జైళ్లలోని మావోయిస్టులను కలిసి లొంగుబాట్లపై మాట్లాడుతామని పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచంలో తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరిస్తామని దేవ్జీ వెల్లడించారు. మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.