తెలంగాణలో పాలిటిక్స్ మాంటి ఊపుమీదున్నాయి. అందులోనూ రేపు (ఫిబ్రవరి 03న) అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్కు లీగల్ నోటీసులు అందాయి. పంపింది ఎవరో కాదు.. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపించింది.