నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తన మాట నిలబెట్టుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన మడుగులపల్లి కేజీబీవీ విద్యార్థిని పుట్ల ప్రసన్నకు ఉచిత విమాన టికెట్ అందించారు. 600 మార్కులకు 563 సాధించిన ప్రసన్న మే 17న తొలిసారిగా విమానంలో విశాఖపట్నం వెళ్లనుంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కలెక్టర్ ఈ మేరకు ప్రోత్సహకాన్ని ప్రకటించారు.