మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఒక్క ట్వీట్‌తో అపాయింట్‌మెంట్..

2 years ago 52
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును ఆయన కార్యాలయంలో కలిసిన సునీతా కృష్ణన్ తన జీవితచరిత్ర పుస్తకాన్ని ఆయనకు అందించారు. అలాగే మానవ అక్రమ రవాణా మీద ఆయనతో చర్చించారు. ఈ సమస్యపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని చంద్రబాబు సహకారం కోరారు. అయితే ఇటీవలే సీఎం అపాయింట్‌మెంట్ కోరుతూ సునీతా కృష్ణన్ ట్వీట్ చేయగా.. చంద్రబాబు వెంటనే అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు.
Read Entire Article