ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజోలులో మోడువారిన కొబ్బరి చెట్ల సమస్యకు పరిష్కారంగా, రూ.20 కోట్లతో శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులను వర్చువల్గా ప్రారంభించారు. డ్రెడ్జింగ్, గట్ల బలోపేతం పనులు చేపట్టారు. రైతుల కంట కన్నీరు రానివ్వనని, కోనసీమ సమస్యలపై దృష్టి సారించామని తెలిపారు. కొబ్బరి రైతులకు కోకోనట్ బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు.