దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మురళీ నాయక్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు నుండి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. జనసేన ఎమ్మెల్యేలు మురళీ నాయక్ స్వగ్రామంలో ఆయన తల్లిదండ్రులను కలిసి చెక్కును అందజేశారు. అంతేకాకుండా, మురళీ నాయక్ తల్లిదండ్రులు కోరిన వాలీబాల్ కోర్టు ఏర్పాటు, తండా పేరు మార్పు వంటి విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.