తెలంగాణలో రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహించటం చాలా కష్టం. అందుకు నిదర్శనమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మార్పు. నిన్నటి వరకు ఒక లెక్క.. నిన్న మరో లెక్క అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి కనిపించింది. కులగణన సర్వే రిపోర్టుపై నిప్పులు చెరిగిన తీన్మార మల్లన్న.. మండలిలో మాత్రం తాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన లెక్కను గౌరవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే చాలు అంటూ సౌమ్యంగా మాట్లాడారు.