Lady Conductor Viral video on Rush in Bus: ఏపీలో ఉచిత బస్సు పథకంతో బస్సులలో రద్దీ పెరిగిపోయింది. దీంతో ప్రయాణికులు తమ మాట వినడం లేదంటూ ఓ మహిళా కండక్టర్ ఆవేదన నెట్టింట వైరల్ అవుతోంది. పరిమితికి మించి బస్సులలో ఎక్కుతున్నారని.. డోర్ వద్దనే నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని వాపోయారు. ప్రమాదమని చెప్పినా తన మాట వినడం లేదని.. జనాల మధ్యనే ఊపిరి ఆగిపోతుందా అనే భయం వేస్తోందని తన ఇబ్బందులు చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.