సోషల్ మీడియా ప్రభావంతో చదువుపై పట్టు కోల్పోయిన ఓ బాలుడిని మార్చడానికి అతని మేనమామ వినూత్నంగా ప్రయత్నించాడు. సెల్ ఫోన్కు బానిసైన మేనల్లుడికి, ‘ఇకపై చదువు మానేసి ఫోన్తోనే ఆడుకో’ అని హెచ్చరించాడు. దీంతో కంగుతిన్న ఆ కుర్రాడు, తన అలవాట్లను మార్చుకుంటానని.. ముఖ్యంగా స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లకు దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తూ.. పై చదువులకు అనుమతి ఇవ్వమని లేఖ రాశాడు. ఈ లేఖ విద్యార్థుల భవిష్యత్తుకు సోషల్ మీడియా మోజు ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.