తెలంగాణ మామిడి రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో పండించే మామిడి పండ్లను శుద్ధి చేసి 'తెలంగాణ బ్రాండ్' పేరుతో నేరుగా విదేశాలకు ఎగుమతించే మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఉద్యానశాఖ రూ.35 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు లాభం చేకూరనుంది. బాటసింగారం, కోహెడ వంటి ప్రాంతాల్లో ఆధునిక ప్యాక్హౌస్లు ఏర్పాటు చేయనున్నారు.