వేసవిలో మామిడి పండ్ల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. చూడగానే తినాలనిపించేలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే మామిడిపండ్లు కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. క్యాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లను తినడం ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు. సహజ పద్ధతుల్లో పండిన పండ్లే ఆరోగ్యానికి మంచివని చెబుతున్నారు.