Markapuram Bus Accident Real Hero Balaraju Saves 8 Passengers: మార్కాపురం బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 14మంది చనిపోగా.. 25మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కోలా బాలరాజు అనే వ్యక్తి ఎనిమిది మందిని కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అద్దాలు పగులగొట్టి అందర్ని కాపాడి తను కూడా బయటపడ్డాడు. బాలరాజుకు ప్రమాదంలో చిన్న గాయాలు కావడంతో మార్కాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.