మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది మృతికి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తేలింది. కండిషన్ లేని బస్సును లైసెన్స్ లేని క్లీనర్తో నడిపించడం వల్ల ఈ ఘోరం జరిగిందని పోలీసుల విచారణలో గుర్తించారు. బస్సు మూడుసార్లు ఆగిపోయినా.. యజమాని స్పందించకపోవడం, ప్రమాదం తర్వాత తానే నడిపానని అబద్ధం చెప్పడం విచారణలో వెల్లడైంది. డ్రైవర్కు లైసెన్స్ లేకపోవడంతో ఇన్సూరెన్స్ రాదన్న బీమా సంస్థల ప్రకటనతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.