భక్తులకు ముఖ్య గమనిక. మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా టీటీడీ స్థానిక ఆలయాలను కూడా మూసివేయనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి మూడో తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన తర్వాత శుద్ధి నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.