కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో రాజకీయ దుమారం రేగింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ గతంలో సీబీఐని విమర్శించిన విషయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.