ఇన్స్టాగ్రామ్ పరిచయాలతో మైనర్ బాలికలను మోసం చేసిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్లో చోటు చేసుకుంది. ఆ బాలికలతో చాటింగ్లు చేసి కిడ్నాప్ చేసిన యువకులు లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి యువకులను అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వారికి అనుమతి ఇచ్చిన ఓయో నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.