మద్దతు ధర రాని ధాన్యం విషయంలో రైతుల ఫిర్యాదుల కోసం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైస్ మిల్లుల వద్ద రెవెన్యూ అధికారులను నియమించారు. వారు రైతులకు మద్దతు ధర వచ్చేలా చూడటమే కాకుండా.. ధాన్యం దిగుమతిలో జాప్యం జరగకుండా పర్యవేక్షిస్తారు.