Uravakonda Head Master Letter To Parents: అనంతపురం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల ప్రవర్తనపై విసిగిపోయారు. విద్యార్థుల అల్లరి శృతి మించడంతో వారి తల్లిదండ్రులకు లేఖ రాశారు. పిల్లలను కట్టడి చేయకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఉరవకొండ మండలం అమిద్యాలలోని జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం నాగ మంజుల ఈ లేఖ రాశారు. పిల్లల ప్రవర్తన సరిగా లేదని, పరీక్షల సమయంలో ఇంటికి వెళ్లిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.