తెలంగాణలో కొత్త గోశాలల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వాగతించారు. నిజమైన ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆవులను అక్రమంగా చంపడం ఆపాలన్నారు. గో రక్షణకు ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, తనను సభ్యుడిగా నియమించాలని కోరారు.