శ్రీకాకుళంలో డయోరియా వ్యాప్తి, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాగునీరు కలుషితం వల్ల శ్రీకాకుళంలో డయోరియా ప్రబలింది. రెండు రోజుల్లోనే డజన్ల కొద్దీ జనం అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక, రాజమంద్రి ఘటన అందర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో సీఎం గురువారం సమీక్ష నిర్శహించి, అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రజల మధ్యకు వెళ్తనే సమస్యలు తెలుస్తాయని అన్నారు.