పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను దేశంలోని పార్టీలన్నీ స్వాగతిస్తున్నాయి. ఇక దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి స్పందిస్తూ, పాకిస్థాన్ను కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్రను గుర్తు చేశారు. 1965, 1971 యుద్ధాలలో కాంగ్రెస్ ప్రభుత్వాల చర్యలను ఆమె ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఈ సమస్యను వాడుకుంటున్నారని ఆమె విమర్శించారు. అంతేకాక పాకిస్థాన్ని ముందు నుంచి కట్టడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఆ వివరాలు..