తెలంగాణలో నగర జీవనశైలిని ఆధునీకరించే దిశగా ఆబ్కారీ శాఖ చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్కే పరిమితమైన మైక్రో బ్రూవరీలను రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల నాణ్యమైన క్రాఫ్ట్ బీర్ అందుబాటులోకి రావడంతో పాటు, ప్రభుత్వ ఆదాయం, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.