నాలుగేళ్లుగా ముంబై పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సురేష్ మోరీ అనే మోస్ట్ వాంటెడ్ దొంగను బెజవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముంబైలో 15 పెద్ద దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న అతడు, వేషధారణ మార్చి తెలుగు రాష్ట్రాలకు మకాం మార్చాడు. విజయవాడ, గుంటూరులో దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విజయవాడ పోలీసులు అతన్ని గుంటూరు రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు.