దేశ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి అమరుడైన ఆర్మీ జవాన్ మురళీ నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేశ్, సత్యకుమార్, సవిత నివాళులర్పించారు. ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల ఆర్థిక సాయం, స్మారక చిహ్నం, కాంస్య విగ్రహం, ఐదెకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. వ్యక్తిగతంగా రూ. 25 లక్షల సాయం అందిస్తానని పవన్ ప్రకటించారు.