ముస్లిం ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని.. ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నవారికి ప్రత్యేక రాయితీని కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులందరికీ తమ సాధారణ విధుల్లో ఒక గంట రాయితీని కల్పించింది. ఈ మేరకు సీఎం శాంతి కుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ వెసులుబాటు.. మార్చి 2 నుంచి 31వరకు వర్తించనుంది.