హైదరాబాద్ మహానగర పాలనలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై అధికారిక స్పష్టత రానుంది.