నాగర్కర్నూల్ వివాహిత సామూహిక అత్యాచర ఘటనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన భక్తురాలిపై కామాంధులు అత్యాచారానికి పాల్పడగా.. దాదాపు మూడు గంటల పాటు ఆమెను హింసించినట్లు తెలిసింది. దాహమేస్తుందని నీళ్లు అడిగితే.. కిరాతకంగా మూత్రం పోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.