సూర్యాపేట జిల్లాలో మూఢ నమ్మకాలతో ఏడు నెలల కుమార్తెను బలిచ్చిన తల్లికి జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. బానోతు భారతి అనే మహిళ 2021లో తన ఏడు నెలల కూతురిని మూఢనమ్మకాలతో ఇంట్లోనే బలిచ్చింది. గతంలో ఆమె తన భర్తను సైతం హత్య చేయడానికి ప్రయత్నించింది. దీంతో ఆమె నేర ప్రవృత్తిని పరిగణలోనికి తీసుకున్న న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు.