బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉండగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.