మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సర్కార్కు భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జీటీలో దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి ముప్పు ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారని దాఖలైన పిటిషన్ను ఎన్జీటీ డిస్మిస్ చేసింది. దీంతో మూసీ సుందరీకరణ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది.