తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్లో జనజీవనం స్తంభించింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి, లోతట్టు ప్రాంతాలు, వంతెనలు నీట మునిగాయి. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో భారీగా వరద నీరు చేరటంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు తాళ్ల సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.